విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మకు భాగ్యనగర్ శ్రీమహంకాళి జాతర బోనాల ఉత్సవాల ఉమ్మడి దేవాలయాల కమిటీ బంగారు బోనం సమర్పించింది. గత కొన్ని సంవత్సరాలుగా ఈ సంప్రదాయాన్ని పాటిస్తున్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ (BRS) ఫ్లోర్ లీడర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ (Talasani Srinivas Yadav) పాల్గొని అమ్మవారి ప్రత్యేక దర్శనం చేసుకుని ఆశీస్సులు పొందారు. రెండు తెలుగు రాష్ట్రాలు సుభిక్షంగా ఉండాలని అమ్మవారికి కోరుకున్నానని తలసాని తెలిపారు
