ప్రముఖ నటి సమంత నివాసంలో ఆనందోత్సాహాల మధ్య సీమంతం వేడుక ఘనంగా జరిగింది. త్వరలో తల్లి కాబోతున్న సమంతకు మంగళవారం కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో సంప్రదాయబద్ధంగా ఈ వేడుకను నిర్వహించారు.
సమంత, ఆమె భర్త, ప్రముఖ ఫిల్మ్మేకర్ రాజ్ నిడిమోరు 2025 చివరిలో కోయంబత్తూరులో వీరి వివాహం జరిగింది. తమ తొలి సంతానం కోసం వారు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అలాగే, ఈ ఏడాది డిసెంబర్లో సమంత బిడ్డకు జన్మనివ్వనున్నట్లు తెలుస్తోంది. సమంత సీమంతం సందర్భంగా తీసిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
సీమంతం వేడుకలో సమంత ఎంతో ఉల్లాసంగా, ప్రకాశవంతంగా కనిపించారు. సంప్రదాయ దుస్తుల్లో ఆమె ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. కుటుంబ సభ్యులు, బంధువులు, సన్నిహితుల మధ్య జరిగిన ఈ కార్యక్రమం ఆత్మీయ వాతావరణంలో సాగింది. ముఖ్యంగా తన అత్తగారితో సమంత పంచుకున్న భావోద్వేగపూరిత క్షణాలు అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ వేడుకకు సంబంధించిన చిత్రాలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.
సమంత ప్రెగ్నెస్సి వార్తలు గత జూన్ నెలలో మరింత ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ‘మా ఇంటి బంగారం’ చిత్ర విజయోత్సవ వేడుకలో ఆమె బేబీ బంప్తో కనిపించడంతో గర్భవతి అనే వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. అనంతరం ఆ చిత్ర దర్శకుడు కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించారు. అప్పటి నుంచి సమంత తన ప్రెగ్నెన్సీకి సంబంధించిన విశేషాలను అప్పుడప్పుడు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటున్నారు.
తాజాగా జరిగిన సీమంతం వేడుకపై సమంత దంపతులు అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయనప్పటికీ, ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో అభిమానులు, సినీ ప్రముఖులు, శ్రేయోభిలాషులు ఈ జంటకు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
తమ జీవితంలో కొత్త అధ్యాయాన్ని ఆరంభించబోతున్న సమంత, రాజ్ నిడిమోరు దంపతులకు ఈ సీమంతం వేడుక మరింత ప్రత్యేకమైన సందర్భంగా నిలిచింది. కుటుంబ సభ్యుల ఆశీస్సులు, సన్నిహితుల సమక్షంలో జరిగిన ఈ సంప్రదాయ వేడుకకు సంబంధించిన క్షణం అభిమానుల దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ వేడుకకు సంబంధించిన చిత్రాలు సామాజిక మాధ్యమాల్లో వేగంగా వ్యాపిస్తుండగా, సమంత త్వరలో తల్లి కాబోతున్న సందర్భంగా ఆమె అభిమానులు హర్షం వ్యక్తం చేస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
