బల్కంపేట రేణుక ఎల్లమ్మ అమ్మవారి మహా కళ్యాణం నేడు హైదరాబాద్లోని బల్కంపేట ఎల్లమ్మ దేవస్థానంలో అంగరంగ వైభవంగా జరుగుతోంది. దీనికోసం ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.సుమారు 8 లక్షల మంది భక్తులు హాజరవుతారని అధికారులు అంచనా వేశారు.కళ్యాణం అనంతరం మధ్యాహ్నం నుంచి మహా అన్నదానం నిర్వహించనున్నారు. ఆ తరువాతి రోజు అనగా బుధవారం అమ్మవారి రథోత్సవం జరగనుంది.
